Thursday, March 28, 2024

30న అన్న‌మయ్య జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

ఈనెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పర్యటన ఖరారైంది. 30న ఉదయం 9 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి బయలుదేరి 9:30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు.
అక్కడి నుంచి హెలికాప్టర్ లో 11:10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలకు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుండి 11:30 గంటలకు టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement