Saturday, April 20, 2024

నేడు తిరుపతి, నంద్యాల జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుపతి, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు.ఈ ఉదయం నంద్యాల జిల్లాకు వెళ్ళనున్నారు సీఎం వైఎస్ జగన్, జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అలాగే వైయస్ జగన్ సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, సాయంత్రం 5:15 కు తుమ్మలగుంట చేరుకోనున్నారు.

అక్కడి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. తుమ్మల గుంటలోని చెవిరెడ్డి నివాసంలో అరగంట పాటు గడపనున్నారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు తుమ్మలగుంట నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆయన, 6:15కి రేణిగుంట నుంచి గన్నవరం బయలుదేరనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement