Saturday, April 20, 2024

హైకోర్టు తీర్పుపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన మీడియాకు వివరించే అవకాశముంది. అంతేకాదు రాజధాని అంశంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని తెలిపింది. హైకోర్టు తీర్పుపై బొత్స, మోదుగుల తదితరులు అసహనం వ్యక్తం చేశారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement