కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 8మంది చనిపోయిన ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఏపీ సీఎంవో ట్వీట్ చేసింది.
- Advertisement -