Saturday, April 20, 2024

కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జులై 8న దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ నెల 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం అయిన తర్వాత బద్వేలుకు జగన్ తొలిసారి వస్తున్నారు. దాదాపు రూ. 400 కోట్ల అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా బహిరంగసభ కోసం బైపాస్ రోడ్డులోని ఒక స్థలాన్ని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి పరిశీలించారు. జగన్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement