Saturday, April 20, 2024

27న విశాఖకు సీఎం జ‌గ‌న్

ఈనెల 27వ‌తేదీన‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు. 2022 యుద్ధ నౌకల సమాహారంలో భాగంగా ఎల్లుండి ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి జగన్ హాజరుకానున్నారు. 27వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నావల్ డాక్ యార్డుకు బయలుదేరి వెళతారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఐఎన్ఎస్ సబ్ మెరీన్ ను సందర్శిస్తారు. అనంత‌రం సాయంత్రం 5.30 గంటలకు ఆర్కే బీచ్ కు చేరుకుని ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలాన్ లో జ‌గ‌న్ పాల్గొని ప్రసంగించ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement