Thursday, April 25, 2024

AP | ఇంటింటి చెత్త సేక‌ర‌ణకు ఈ-ఆటోలు.. 8న ప్రారంభించ‌నున్న సీఎం జ‌గ‌న్‌

క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ కోసం ఈ-ఆటోలను సీఎం జ‌గ‌న్ ఎల్లుండి (8న‌) ప్రారంభించనున్న‌ట్లు రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి వై.శ్రీలక్ష్మి తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో కార్య‌క్ర‌మంలో భాగంగా ఏపీలో ఇంటింటి చెత్తను తడి, పొడిగా సేకరణ చేయడానికి 516 ఈ-ఆటోలను ప్రభుత్వం అందించిందని, వీటిని గురువారం ఉదయం 9 గంటలకు తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం ప్రారంభిస్తారని తెలిపారు.

శుక్రవారం నుండి ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల వార్డ్ సచివాలయాల వారిగా ఈ-ఆటోలు అందుబాటులోకి వస్తాయని శ్రీ‌ల‌క్ష్మి తెలిపారు. దీంతో మెరుగైన చెత్త సేకరణ 100శాతం చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఇప్పటికే ప్రజారోగ్య కార్మికులకు దశల వారిగా ఆటోల డ్రైవింగ్ శిక్షణ ఇచ్చామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement