Thursday, March 28, 2024

ఢిల్లీకి సీఎం జగన్.. తొలి భేటీ ఎవరితో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఢిల్లీకి బయల్దేరారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, మిధున్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి, బాలశౌరి తదితరులు ఉన్నారు. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ఆయ‌న ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్‌షాతోపాటు జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయ‌న‌ చర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: దేశంలో 24 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ: కేంద్ర ఆరోగ్యశాఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement