Saturday, April 20, 2024

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర నిధులు త్వరగా వచ్చేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పోలవరం ప్రాజెక్ట్‌ పనుల ప్రగతిని సీఎం జగన్‌కు వివరించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన దిగువ కాపర్‌ డ్యాం పనులు, కెనాల్స్‌కు కనెక్టివిటీ అంశాలపై సమీక్షలో చర్చించారు. గ్యాప్‌ 3 కాంక్రీట్‌ డ్యామ్‌ పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి కాల్వల ద్వారా నీరందించేందకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఈసీఆర్‌ఎఫ్‌ పనుల ప్రారంభానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారలు సీఎం జగన్‌కు వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 2,033 కోట్ల రూపాయలకు పైగా నిధులు రావాల్సి ఉందని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర నిధులు త్వరగా వచ్చేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ అయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎం సూచించారు.  

నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేశామని.. నవంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమని అధికారులు సీఎంకు వివరించారు. అవుకు టన్నెల్‌ నిర్మాణంలో గణనీయ ప్రగతి సాధించామని.. వచ్చే ఆగస్టు నాటికి టన్నెల్‌ పూర్తి చేసి నీటిని ఇస్తామని అధికారులు తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రెండో టన్నెల్‌ పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వంశధార స్టేజ్‌-2 పనులు వచ్చే మే నాటికి పూర్తి చేస్తామని తెలిపారు అధికారులు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఒడిశా రాష్ట్రంతో చర్చల కోసం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. తోటపల్లి బ్యారేజీ కింద వచ్చే ఖరీఫ్‌ నాటికి నీటిని అందిస్తామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: TS Assembly: రాష్ట్ర సర్పంచులే గౌరవంగా బతుకుతున్నారు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement