Friday, March 29, 2024

BREAKING: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు?!

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రులకు దక్కే శాఖలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా ఉండే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయని సమాచారం. అయితే, మంత్రులకు శాఖల కేటాయింపుపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియారిటీ ఆధారంగా కీలకు శాఖల కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డినే కొనసాగిస్తారని తెలుస్తోంది. బుగ్గనకు అదనంగా ఐటీశాఖ కేటాయించే అవకాశం ఉంది.

ధర్మాన ప్రసాదరావుకు పంచాయతీరాజ్ శాఖ, కాకానికి వ్యవసాయశాఖ కేటాయించే ఛాన్స్ ఉంది. రోజాకు పౌర సరఫరాల శాఖ, అంజాద్ బాషాకు డిప్యూటీ సీఎం, మైనార్టీ వెల్ఫేర్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణాకు బీసీ వెల్ఫేర్ శాఖ, సీదిరి అప్పలరాజుకు మత్స్యశాఖ, విశ్వరూప్ కు సోషల్ వెల్ఫేర్, పెద్దిరెడ్డికి విద్యుత్, అటవీ, గనులశాఖ, అంబటి రాంబాబుకు సినిమాటోగ్రఫీ, బొత్స సత్యనారాయణకు మున్సిపల్ శాఖ, ఉషశ్రీకి మహిళా, శిశు సంక్షేమశాఖ కేటాయించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement