Friday, April 26, 2024

బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డికి కీలక పదవి

కర్నూల్ జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి సీఎం వైఎస్‌ జగన్‌ కీలక పదవి కట్టబెట్టారు. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ చైర్మన్‌ పదవి(శాప్‌)ని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నామినేటెడ్‌ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా ​ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ పదవిని సిద్ధార్థ్‌రెడ్డికి అప్పచెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు.

కాగా, బైరెడ్డికి తన పదవి ఇస్తానని పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: థర్డ్ వేవ్ వచ్చేసింది.. ప్రైమరీ స్టేజ్ లో ఉన్నాం: WHO

Advertisement

తాజా వార్తలు

Advertisement