Wednesday, April 17, 2024

మంత్రి అప్ప‌ల‌రాజును అభినందించిన సీఎం జ‌గ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్ర మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యశాఖ అద్భుత ఫలితాలు సాధిస్తోంద‌ని ఈరోజు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మర్యాదపూర్వకంగా కలిశారు.

భారత ప్రభుత్వం మత్స్యశాఖలో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించామని సీఎంకు చెప్పారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈనెల 21న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.10 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహకం, మెమొంటో అందించిందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన మెమొంటోను సీఎం జగన్‌ కు చూపించ‌డంతో మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, అధికారులను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement