Thursday, April 25, 2024

సిరివెన్నెలకు సీఎం జగన్ నివాళి

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అని ఆయన అన్నారు. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు అని చెప్పారు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటని పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement