Thursday, April 25, 2024

వరద ముంపు ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే..

భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు జిల్లాల్లో ఈ రోజు ముఖ్యమంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్న‌ట్టు అధికారిక వ‌ర్గాల స‌మాచారం. ఉదయం తాడేపల్లిలో ఆయా జిల్లాల కలెక్టర్లతో ముందుగా సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించ‌నున్నారు.

అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు ఏపీ సీఎం జ‌గన్‌. అక్కడినుంచి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలైన క‌డ‌ప‌, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల‌ను పరిశీలించ‌నున్నారు. ఏరియల్ సర్వే ముగిసిన త‌ర్వాత నేరుగా రేణిగుంట చేరుకుని, అక్కడినుంచి తిరిగి గన్నవరం చేరుకుంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement