Saturday, April 20, 2024

రఘురామ కృష్ణంరాజు ఇంటికి సీఐడీ అధికారులు

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు మ‌రోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. గతంలో రఘురామను విచారించిన సీఐడీ, ఆ తర్వాత ఆయనను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే కాగా.. మరోసారి సీఐడీ పోలీసుల విచారణకు రావాలని రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చినట్టుగా చెబుతున్నారు.. మ‌రోసారి రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే మరి సీఐడీ నోటీసుల్లో ఏముందో.. ఎంపీ రఘురామ ఈ విషయంలో ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి. కాగా, గతంలో సీఐడీ విచారణ, అరెస్ట్‌పై పెద్ద వివాదమే నడిచింది.. ఆయన పాదాలపై మరకల వ్యవహారం చర్చగా మారింది.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న‌ రఘురామ కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement