Tuesday, March 26, 2024

గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం… టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి

శ్రీకాళహస్తి – రాష్ట్రంలో ఏ రాజకీయ శక్తులు అడ్డుపడిన ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతామని రాష్ట్ర మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, కన్నబాబు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఉప ఎన్నికల అనంతరం టిడిపి అడ్రస్ గల్లంతే అంటూ మంత్రులు ఎద్దేవా చేశారు. శ్రీకాళహస్తిలో వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని తెలిపారు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల తర్వాత టిడిపి పార్టీ అడ్రస్ గల్లంతే అవుతుందని మంత్రి హెచ్చరించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మద్దెల గురుమూర్తి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక వైసిపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement