Friday, March 29, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ అభ్యర్థి గురుమూర్తి

ఏర్పేడు: తిరుపతి ఉప ఎన్నికలలో వై సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ మద్దిల గురుమూర్తి తన ఓటు హక్కును స్వగ్రామమైన ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామంలో శనివారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకు ముందు ఆయన తన ఇంటి వద్ద గోవు పూజ చేయూకున్నారు. అనంతరం తమ కుల దేవత మునేశ్వర స్వామికి తన భార్య నవ్య, తల్లిదండ్రులు మ్యూనికృష్ణయ్య, రమణమ్మ లతో కలసి పూజలు చేసుకుని స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక దూరం పాటిస్తూ.. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కోబాక మీద రేణిగుంట కు బయలుదేరి వెళ్లారు

Advertisement

తాజా వార్తలు

Advertisement