Thursday, April 25, 2024

గురుమూర్తి ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ లక్ష్మీపతి………….

రేణిగుంట – తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తో విప్పమానుపట్టేడ సర్పంచ్ లక్ష్మీపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ పార్టీ రేణిగుంట మండలం ఇంచార్జి బియ్యపు పవిత్ర రెడ్డి, మండల కన్వీనర్ హరి ప్రసాద్ రెడ్డి సూచనలు సలహాలతో సర్పంచ్ లక్ష్మీపతి ఆధ్వర్యంలో విప్పమానుపట్టేడ నుండి భారీ బైక్ ర్యాలీ తో రేణిగుంట పట్టణం చేరుకున్నారు. మండలం నుండి వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు బియ్యపు మధుసూదన్రెడ్డి అభిమానులతో కిక్కిరిసిన ర్యాలీలో పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తినీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని సర్పంచ్ లక్ష్మీపతి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement