Friday, April 19, 2024

వైసిపి అభ్య‌ర్ధికి భారీ మెజార్టీ – విప్ శ్రీకాంత్ రెడ్డి మంత‌నాలు….

శ్రీకాళహస్తి – మాజీ శాసనసభ్యుడు ఎస్ సి వి నాయుడుతో ప్రభుత్వ చీఫ్ విప్ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చర్చలు జరిపారు. శనివారం ఎస్ సి వి స్వగృహంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బేటీ అయి ఉప ఎన్నికల్లో వైసిపి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. భారీ మెజార్టీ సాధించే దిశగా ప్లానింగ్ చేయాలని సూచించారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు అందరినీ సమన్వయం చేస్తూ భారీ మెజార్టీ సాధించే విధంగా ముందుకుపోవాలని అందుకు నిర్మాణాత్మక సహకారం అందించాలని ఎస్ సి వి నాయుడు ను చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో సాధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కి కానుకగా ఇద్దామని నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement