Thursday, April 18, 2024

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహేంద్రకు విప్ చెవిరెడ్డి పరామర్శ..

తిరుపతి రూరల్ మండలం వైఎస్సార్సీపీ సేవాదళ్ ఉపాధ్యక్షులు మల్లారపు మహేంద్ర ను ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి పరామర్శించారు.  తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేంద్రకు  ప్రభుత్వ విప్ చెవిరెడ్డి ధైర్యం చెప్పారు. ముందురోజు రోడ్డు ప్రమాదంలో మహేంద్ర తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న చెవిరెడ్డి మహేంద్ర ను పరామర్శించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. త్వరితగతిన కోలుకొని ఇంటికి వస్తారని తెలిపారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement