Thursday, March 28, 2024

టిటిడిలోని ప‌లు సంస్థ‌ల్లో జెఈవో త‌నిఖీలు

తిరుపతి, – టిటిడిలోని ప‌లు సంస్థ‌ల్లో జెఈవో స‌దా భార్గ‌వి గురువారం త‌నిఖీలు నిర్వ‌హించారు. తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్‌, టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప్రాంగ‌ణంలోని ల‌డ్డూ కౌంట‌ర్లు, జాబిలి చిన్న‌పిల్ల‌ల కేంద్రం ముందు గ‌ల ఖాళీ స్థ‌లాన్ని ప‌రిశీలించి చేప‌ట్టాల్సిన మార్పుల‌పై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతుండ‌డంతో విష్ణునివాసాన్ని క్వారంటైన్ కేంద్రంగా తిరిగి జిల్లా యంత్రాంగానికి అప్ప‌గించిన నేప‌థ్యంలో అక్క‌డి శ్రీ‌వారి సేవ‌కుల‌ను భూదేవి కాంప్లెక్స్‌కు త‌ర‌లించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. జెఈవో వెంట విజివో మ‌నోహ‌ర్, డెప్యూటీ ఈవో భార‌తి, ఎవిఎస్వో శ్రీ సాయి గిరిధ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement