Saturday, April 20, 2024

కేంద్రీయ వైద్య‌శాల‌లో కోవిడ్ టీకా వేయించుకున్న టిటిడి ఈవో

తిరుపతి – టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని కేంద్రీయ వైద్య‌శాల‌లో ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శ‌నివారం కోవిడ్ టీకా వేయించుకున్నారు. అనంత‌రం వ్యాక్సినేష‌న్ జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, స్థానిక ఆల‌యాల్లో ప‌నిచేసే ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఇదివ‌ర‌కే కోవిడ్ టీకాలు వేయించిన‌ట్టు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఏప్రిల్ 1వ తేదీ నుండి 45 ఏళ్లు పైబ‌డిన ఉద్యోగులంద‌రికీ టీకా వేయించాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు చెప్పారు. తాను కూడా ఈరోజు కోవాక్సిన్ టీకా మొద‌టి డోసు వేసుకుని స‌ర్టిఫికేట్ పొందాన‌ని, 4 వారాల నుండి 6 వారాల మ‌ధ్య రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుంద‌ని అన్నారు. ఇదివ‌ర‌కు టీకాలు వేయించుకున్న టిటిడి సిబ్బంది స‌మ‌యానుసారంగా రెండో డోసు వేసుకోవాల‌ని సూచించారు. ఈవో వెంట ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement