Friday, April 19, 2024

టీటీడీ ప‌రిపాల‌న చాలా బాగుంది : కేంద్ర మాజీ మంత్రి సుబ్బిరామిరెడ్డి

తిరుపతి : టీటీడీ పరిపాల ప్రస్తుతం చాలా బాగుంది అని కేంద్ర మాజీ మంత్రి టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నార‌న్నారు. అన్యాయానికి అవకాశం లేకుండా భక్తులకు సేవ చేస్తున్నార‌ని అభినందించారు. ఎంత మంచి పాలన ఉన్నా దానిపై రాళ్లు వేయడం మామూలే అని, రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా చేసిన వ్యక్తిగా టీటీడీ పాలనను ప్రశంసిస్తున్నా అని సుబ్బిరామిరెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement