Friday, March 29, 2024

చిత్తూరు జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. ఓ వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్లిపోగా అప్పులు ఇచ్చిన వారు ఆ వ్యక్తి ఇంటికెళ్లి ఆతని కుటుంబ సభ్యులును అసభ్య పదజాలంతో దూషించడం, శాపనార్ధాలు పెట్టారు. దీంతో అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం చెందిన శంకరయ్య పెద్ద కుమారుడు సతీష్ (35) అప్పులు చేసి తీర్చలేక ఊరి వదిలి వారం క్రితం పరారైయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అప్పులు ఇచ్చిన వారు సతీష్ ఇంటికి వెళ్ళి తమ వద్ద తీసుకున్న అప్పులు తీర్చాలని గొడవకు దిగినట్టు సమాచారం. అంటే కాకుండా అసభ్యపద జాలంతో సతీష్ కుటుంబ సభ్యులును దూషించడంతో తన కుమారుడు చేసిన అప్పు తీర్చే స్థోమత లేక అవమానం భరించలేక సతీష్ తండ్రి శంకరయ్య (65), తల్లి గురమ్మ(55), వినయ్(22) పురుగుల మందు తాగారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆటోలో పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. ముగ్గురు చనిపోవడంతో రాచపాలెం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement