Wednesday, April 24, 2024

పట్టపగలే ఉపాధ్యాయుడి ఇంట్లో దొంగతనం..

తిరుపతి సిటీ : ప‌ట్ట‌ప‌గ‌లే తలుపులు బద్దలు కొట్టి దొంగతనం జరిగిన సంఘటన గురువారం జరిగింది.. ఎంఆర్ పల్లి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి రూరల్ మండలం కాలూరు క్రాస్ సమీపంలో కాపురం ఉంటున్న నారాయణ స్కూల్ లో విధులు నిర్వహిస్తున్న టువంటి రామ్మోహన్ ఇంట్లో దొంగ‌ప‌లు ప‌డ్డారు. గురువారం ప‌నిమీద‌ భార్య భర్తలు ఇరువురు నెల్లూరు తిరిగి వచ్చారు. ఇంట్లో చూడగానే తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోని 33 గ్రాముల బంగారు. 750 గ్రాములు వెండి దొంగతనం జరిగినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వేలిముద్రలు సేకరించినట్లు ఎంఆర్ పల్లి పోలీసులు తెలియజేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement