Saturday, April 20, 2024

ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ : 375 గ్రాముల బంగారు, రూ. లక్ష నగదు మాయం

తిరుపతి సిటీ : తిరుపతి నగరంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సుబ్బారెడ్డి నగర్ లో ఉపాధ్యాయుడు వరప్రసాద్ రెడ్డి కాపురముంటున్నాడు. మొదటి అంతస్తులో నిద్రిస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్ లో దొంగలు తలుపులు తెరిచి ఇంట్లో బీరువాలో ఉన్న 375 గ్రాముల బంగారు, లక్ష రూపాయలు దొంగతనం జరిగింది. అయితే బాధితుడు నిద్ర లేచి వాకింగ్ వెళ్లడానికి ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్టు గుర్తించాడు. ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement