Thursday, April 25, 2024

Flash … Flash : త‌ప్పిపోయిన విద్యార్థుల ఆచూకీ ల‌భ్యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా చంద్ర‌గిరిలో నాలుగు రోజుల క్రితం న‌లుగురు విద్యార్థులు అదృశ్య‌మ‌య్యారు. అయితే త‌ప్పిపోయిన సాంప్రదాయ పాఠశాల విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. విద్యార్థులు ముంబైలో ఉండటాన్నిగమనించిన ఓ వ్యక్తి చేరదీశారు. ఆ నలుగురు విద్యార్థులను రిజర్వేషన్ చేయించి శ్రీనివాస్ అనే వ్య‌క్తి రైలులో తన వెంట తీసుకు వస్తున్నారు. ఇప్పటికే కొల్లాపూర్ చేరుకున్న పోలీసులు శ్రీనివాస్ నుండి విద్యార్థులను తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement