Thursday, April 25, 2024

తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24 గంటల సమయం

తిరుమల : క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. దీంతో టీటీడీ అధికారులు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందుల‌కు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 79,370 మంది భక్తులు దర్శించుకోగా 39,199 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.25 కోట్లు వచ్చిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement