Thursday, April 25, 2024

Breaking: చిత్తూరు జిల్లా శాంతిపురం వ‌ద్ద‌ ఉద్రిక్తత..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శాంతిపురం వ‌ద్ద‌ ఉద్రిక్తత చోటుచేసుకుంది. గడ్డూరు క్రాస్ వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లకుండా వారిని ఆపేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఏపీ బార్డ‌ర్ లో అడిష‌న్ ఎస్పీతో పాటు న‌లుగురు డీఎస్పీల ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మొహ‌రించారు. మ‌రో వైపు చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లికేందుకు టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్తలు భారీ సంఖ్య‌లో చేరుకుంటున్నారు. ఇప్పటికే మైక్ పర్మీషన్ లేదని నాలుగు రథాలను సీజ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement