Saturday, April 20, 2024

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు పంచాయతీ పరిధిలోని అగ్రికల్చరల్ స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రాజారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయ సూత్రాల యొక్క ప్రాముఖ్యతపై చాలా బలమైన ప్రాధాన్యత ఇచ్చిన కొద్దిమంది లో జగ్జీవన్ రామ్ కూడా ఒక్కరని అంటరానితనం, అసమానతలు, మరియు అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని, కుల వివక్షను నిషేధించడంతో పాటు దళితులకు తగినంత రాజకీయ ప్రాతినిద్యం కోసం తీవ్రంగా శ్రమించారని, మొదటి సారిగా దళితులు ఓటు వేసే రాజకీయ హక్కులను కోరాడని, ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement