Thursday, April 25, 2024

తిరుమ‌ల‌లో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేంద‌కు వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 58,494 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 24,025 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement