Thursday, April 25, 2024

తిరుమ‌ల‌లో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ… శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 6 గంట‌ల స‌మ‌యం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. నేడు భ‌క్తుల ర‌ద్దీ కొంత త‌క్కువ‌గానే ఉండ‌డంతో శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 6 గంటల సమయం పడుతోంది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని 66,020 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 29,195 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement