Tuesday, April 23, 2024

రథ సప్తమి – సప్త వాహనాలపై విహరిస్తున్న దేవ దేవుడు

తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. నేడు సప్త వాహనాలపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు కనువిందు చేశారు. శ్రీవారికి ఉదయం 9 గంటలకు చిన శేష వాహనంపై విహరించారు..11 గంటలకు గరుడ వాహన సేవ నిర్వహించారు.

మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనంపై శ్రీవారు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి కనువిందు చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఇక సాయంత్రం 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు కనిపించనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement