Thursday, April 18, 2024

Tirupati: బాలికపై అత్యాచారం..

తిరుపతి సిటీ, మే 25 (ప్రభ న్యూస్) : కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన కూలీల కుటుంబం స్థానిక ఎం ఆర్ పల్లి పరిధిలోని న్యూ బాలాజీ కాలనీలో కాపురం ఉంటున్నారు. వారు ఉద‌యాన్నే 4గంట‌ల‌కు కూలీ ప‌నుల‌కు వెళ్తుంటారు. అయితే సమీప ప్రాంతంలో కాపురం ఉంటున్న చెగయ్య అనే వ్యక్తి 13ఏళ్ల‌ బాలికను ఇంటికి పిలిపించుకుని నోటికి గుడ్డ చుట్టి బాత్రూంలో అత్యాచారయత్నం చేశాడు. ఆ బాలిక తమ్ముడు త‌మ‌ అక్కని వదలమని చెప్పడంతో ఇక్కడ లేదని బుకాయించాడు. దీంతో ఆ యువతి తమ్ముడు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇంతలో ఆ బాలిక తండ్రి వచ్చి యువకుడి ఇంట్లో గాలించగా.. ఆ బాలిక ఇంట్లో లేదని ఆ యువకుడు పదే పదే చెప్పాడు.

ఆయ‌న వెళ్లిపోయాక ఆ బాలిక పై బాత్రూంలో అత్యాచారం చేశాడు. దీంతో బాలిక తండ్రి ఎంఆర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే స్థానిక నాయకులు కర్నూలు జిల్లా వాళ్లపై ఒత్తిడి తీసుకువచ్చి కొంతమంది కేసు లేకుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు పెడితే మీరే ఇబ్బంది పడతారని ఆ యువతి తల్లిదండ్రులను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా పత్తికొండ కూలీలు ప్రాధేయ పడుతున్నారు. ప‌లు పార్టీలు, ప్రజాసంఘాలు తమకు అండగా ఉండి త‌మ‌కు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement