Friday, April 19, 2024

అభివృద్ధికావాలంటే బిజెపికి ఓటేయండి – ర‌ఘ‌నంద‌న్ రావు..‌

తిరుప‌తి – తిరుప‌తి అభివృద్ధిప‌థంలో ముందుకుపోవాలంటే బిజెపి అభ్య‌ర్ధి రత్న‌ప్ర‌భ‌కు ఓటు వేయాల‌ని పిలుపు ఇచ్చారు తెలంగాణ దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘ‌నంద‌న్ రావు ఓట‌ర్ల‌కు పిలుపు ఇచ్చారు.. బిజెపి అభ్య‌ర్ధి ర‌త్న‌ప్ర‌భ‌తో క‌లిసి తిరుప‌తిలో ఆయ‌న పాద‌యాత్ర‌గా ఎన్నిక‌ల్ ప్ర‌చారం నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, వైసిపికి ఓటేస్తే సంఖ్య పెరుగుతుంది తప్ప.. అభివృద్ధి ఉండదని అన్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారాలు, అన్యమత ప్రార్థనా మందిరాలు లేకుండా చట్టం తీసుకొస్తామన్నారు. సాంకేతికత ఉన్నా విగ్రహాలు ధ్వంసం చేసే వారిని పట్టుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి మతప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా విస్మరించాయని చెప్పారు. వైసీపీ తరహాలోనే దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ గురించి సవాళ్లు విసిరి భంగపడిందని గుర్తు చేశారు. దుబ్బాక ఫలితాన్నే తిరుపతిలో రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి గెలిచిన ఎంపీ ఇంత వరకు ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement