Wednesday, March 27, 2024

మానవత్వం చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి

పీలేరు -తిరుపతి రహదారిలో కళ్యాణి డాం సమీపంలోని పోలీస్ ట్రైనింగ్ కళాశాల మలుపులో ద్విచక్ర వాహనదారులు సృహ తప్పి రోడ్డు మీద పడిపోయాడు. ఆ దారిన వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారును ఆపి , ఎస్కార్ట్ సిబ్బంది గాయపడిన ద్విచక్ర వాహనదారుడి ముఖం మీద నీళ్లు చల్లి సృహ లోకి వచ్చేటట్టు చేశారు. వెంటనే 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఏది ఏమైనా అటుగా వెళ్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కారును ఆపి గాయ పడిన వ్యక్తికి ప్రధమ చికిత్స చేయించి రుయా కు తరలించి మంత్రి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement