Thursday, April 25, 2024

కొడుకులున్నా వేస్ట్ – పంచాయితీ సిబ్బంది బెస్ట్

కరోనా తో మృతి చెందిన అతనికి దహన సంస్కారం చేస్తున్న ఉద్యోగులు

కరోనా తో చనిపోయిన తండ్రి దగ్గరికి రానీ బంధువులు

బంగారుపాలెం మండల పరిధిలోని కే యం కండిగ గ్రామ పంచాయతీకి చెందిన లక్ష్మీపురం గ్రామంలో శ్రీనివాసులు నాయుడు కరోనా తో గురువారం మరణించినాడు ఇతనికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు శ్రీనివాసులు నాయుడు మృతి చెందడంతో బంధువులు ఎవరు దగ్గరికి రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శి గుణశేఖర్ సచివాలయ సిబ్బంది రూపేష్ కావ్య ఏ ఎన్ ఎం సుమతి ఆశ వర్కర్ మహేశ్వరి హరిత రాయబారి కన్నయ్య ముందుకు వచ్చి పి.పి. ఇ. కిట్స్ ధరించి శ్రీనివాసులు నాయుడు అంత్యక్రియలు జరిపించి పంచాయతీ అధికారులు సచివాలయ సిబ్బంది ఆశావర్కర్లు మానవత్వం చాటుకున్నారు గురువారం బంగారుపాలెం మండలం 53 కేసులు నమోదైనట్లు డాక్టర్ రోహిత్ చెంగల రాయలు తెలిపారు కనుక ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉండి ప్రాణాలు కాపాడుకోవాలని మండల ప్రజలను ఆయన కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement