Wednesday, April 24, 2024

కూర‌గాయలు అమ్ముతూ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్ర‌చారం…

సైదాపురం : వైసీపీ ప్రభుత్వం లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని , వాటిని అదుపు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తిరుపతి పార్లమెంట్‌ తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు. సైదాపురం మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కూర గాయల వ్యాపారస్తులతో మాట్లాడి కూర గాయల ధరలు , నిత్యావసరాల ధరలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కొంత సేపు అమె కూర‌గాయ‌ల దుకాణంలో కూర్చుని కూరలు అమ్మారు.. వైసిపి పాల‌న‌లో ధ‌ర‌లు ఎలా పెరిగిపోతున్నాయో షాపుకి వ‌చ్చిన వారికి వివ‌రించారు.. అనంత‌రం ఇంటింటికీ వెళ్లి వైసీపీ చేస్తున్న అరాచక పాలనను వివరించి ఆమె ఓట్లు అభ్యర్థించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసరాలు మనకు ఎంత ముఖ్యమో , వాటి ధరలు అదుపు చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు. వాటి ధరలు- తగ్గాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని , సైకిల్‌ గుర్తుకు ఓటు- వేయాలని కోరారు. రాష్ట్రం మొత్తంలో ఉన్న టీడీపీ అగ్ర నాయకులు తిరుపతి పార్లమెంటు- వైపు టీడీపీ గెలుపు కోసం కదిలి వస్తున్నారన్నారు. అదే విధంగా బాలాయపల్లి మం డలంలో కూడా ఆమె టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడుతో కలిసి ర్యాలీ , రోడ్‌ షో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె వెంట వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొ ండ్ల రామకృష్ణ , పర్చూరు మాజీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు , గురజాల మాజీ ఎమ్మెల్యే పర్వతనేని శ్రీనివాసరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు , తదితరులు ఉన్నారు.అదే విధంగా పొదలకూరు మండలంలో పనబాక లక్ష్మికి మద్దతుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement