Thursday, April 25, 2024

సుస్థిర వ్యర్థ నిర్వహణపై అంతర్జాతీయ సదస్సు.. మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి సిటీ : సుస్థిర వ్యర్ధాల నిర్వహణపై ఎస్వీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుమారు 51 దేశాల నుండి హాజరైన ప్రతినిధులు వ్యర్థాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చ ప్రకృతి పట్ల మానవాళి అమర్యాదతో ప్రవర్తించడంతో ఇప్పుడు భూతాపం, వరదలు, తుఫాన్ లు లాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నామ‌న్నారు. మంచి ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితం కోసం ఒక మంచి స్వచ్చమైన వాతావరణం అవసరమ‌న్నారు. సుస్థిర అభివృద్ధి సాధించాలంటే వ్యర్థాల నిర్వహణకు ముఖ్యం వ్యర్థ నిర్వహణ ఒక బరువు గల బాధ్యతగా కాకుండా ఒక అవకాశంలా చూడాలన్నారు. తద్వారా అనేక మందికి ఉపాధి లభించడంతో పాటుగా గ్రీన్ హౌజ్ గ్యాస్ లను తగ్గించవచ్చన్నారు. స్వీయ సుస్థిర వ్యర్థ నిర్వహణ మాత్రమే ఇందుకు పరిష్కారమ‌న్నారు.

ఏపీలో 123 మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయన్నారు. ఇందులో సుమారు 1.49 కోట్ల పట్టణ జనాభా, 44.57 లక్షల గృహాలున్నాయ‌న్నారు. క్లీన్ ఆంధ్ర మిషన్ (క్లాప్) ద్వారా వ్యర్థ రహిత నగరాలుగా వీటిని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుం బిగించారన్నారు. ఇందుకోసం 3648 హైడ్రాలిక్ గార్బేజ్ టిప్పర్లు, డీజల్ అండ్ ఎలెక్ట్రిక్ ఆటోలు, 24 వేల రిక్షాలు అందించామ‌న్నారు. వీటి ద్వారా సుమారుగా రోజుకు 7వేల టన్నుల వ్యర్ధాలను తరలిస్తున్నామ‌న్నారు. ఇవేకాక 2.43 లక్షల టాయిలెట్స్, 623 పబ్లిక్ టాయిలెట్స్, 795 కమ్యూనిటీ టాయిలెట్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. వీటన్నింటి ద్వారా క్లాప్ సుమారుగా 3 వేల మందికి నేరుగా ఉపాధి కల్పించిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 48 మురుగునీటి శుద్ధి కర్మాగారాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 59 నిర్మాణ దశలో ఉండగా, అదనంగా 206 టెండర్ దశలో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో రాష్ట్రంలో 40లక్షల గృహాలకు 1.20 కోట్ల చెత్త బుట్టలు అందించామని తెలిపారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సుమారు 2 కోట్ల చెత్త బుట్టలు అందించేందుకు రంగం సిద్దం చేస్తున్నామ‌న్నారు. వ్యర్థాల నుండి విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రోజుకు 2400 టన్నుల వ్యర్థం నుండి 30 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన పెరగాలి, చైతన్యం రావాలన్నారు. తద్వారా మరింత మంచి వాతావరణం నెలకొంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement