Saturday, April 20, 2024

నారా లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. అశోక్ కుమార్

తిరుపతి సిటీ : విషయ పరిజ్ఞానం, మనుషుల విలువ తెలియని నారా లోకేష్ బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడే ముందు వారి గురించి లోతుగా తెలుసుకొని మాట్లాడాలని, సంస్కారం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని టిటిడి పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ అన్నారు. బుద్ధిలేని వారు వ్రాసి ఇచ్చిన స్క్రిప్టును చదవడం ద్వారా నారా లోకేష్ పనికిరాని వాడిగా కీర్తింపబడతారన్నారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… మంత్రి పెద్దిరెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఆయన వ్యక్తిత్వం తెలుసుకొని మాట్లాడాలన్నారు. పి ఎల్ ఆర్ పేరుతో దేశ విదేశాలలో కంపెనీలను నెలకొల్పి చేసే వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం పేద ప్రజలకు దేవాలయాలకు ఖర్చుపెట్టే మనస్తత్వం కలిగిన మహోన్నత వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని స్పష్టం చేశారు.

2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అందుకే ప్రజలు చీదరించి అధికారం లేకుండా చేశారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రజలను మోసం చేసేందుకు రోడ్డుపైకి నారా లోకేష్ వచ్చాడన్నారు. లోకేష్ చేస్తున్న గురిగింజ నీతులను ఇక్కడ వినేవారు ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. లోకేష్ చేస్తున్న పాదయాత్రకు స్థానికులు ఎవరూ రాకపోవడంతో స్పందన మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడి నుండో అద్దెకు ప్రజలను తెచ్చుకొని తిక్క తిక్క మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునే వాళ్ళు లేరన్నారు. నారా లోకేష్ మాట్లాడుతున్న చేతకాని మాటలు వినలేక ఆ భాష అర్థం కాక ప్రజలు సతమతమవుతూ నవ్వుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లారపు మధు, యువజన విభాగం నాయకుడు బండ్ల లక్ష్మీపతి, మంగళంపేట సురేష్ బాబు, హరిచోహన్ నాయక్, నాగేంద్ర రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement