Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

చిత్తూరు జిల్లా గంగవరం మండలం నాలుగు రోడ్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్ట‌డంతో కారులో ఉన్న తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బెంగళూరుకు చెందిన గాయత్రి (30), కుమారుడు విథున్ (3) గా గుర్తించారు. మృతురాలి భర్త , కుమార్తె కారులో ఇరుక్కు పోయి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement