Tuesday, March 26, 2024

ప‌రిష‌త్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై స‌బ్ క‌లెక్టర్ స‌మీక్ష‌…

మదనపల్లి రూరల్ , – మదనపల్లి నియోజకవర్గం లో ఎంపీటీసీ,జడ్పీటిసి ఎన్నికల ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సబ్ కలెక్టర్ జాహ్నవి పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ బంగ్లా నందు మదనపల్లి, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల యం పి డి ఒలతో ఈ నెల 8 న జరిగే ఎంపీటీసీ,జడ్పీటిసి ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గం పరిధిలోని మూడు జడ్పీటిసి స్థానాలకు,40 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 8 న జరిగే ఎన్నికల అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంపీడీఓ లను ఆదేశించారు. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను పరిశీలించి,పోలింగ్ కేంద్రాల అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.బ్యాలెట్ బాక్స్ లు ను భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్స్ ను పరిశీలించి,స్ట్రాంగ్ రూమ్స్ నందు లైటింగ్,సిసి కెమెరాలు,ఘటి భద్రత ఏర్పాట్లు చేయాలని, పిఓలు,ఎపిఓలు,సిబ్బందికి పోలింగ్ మరియు ఓట్లు లెక్కింపు పై శిక్షణా తరగతులు నిర్వహించాలని,7న సంబందితా మండల కేంద్రాలలో ఎన్నికల సమాగ్రని పంపించేయాలని,అదే రోజు పి ఓలు,ఎపిఓలకు పోలింగ్ కేంద్రాలను కేటాయించాలని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లు,బ్యాలెట్ పేపర్స్ అన్నియు సక్రమంగా ఉండేలా చుచుకోవలని, బ్యాలెట్ పేపర్స్ లో పోటీలో ఉన్న అభుర్థులు పేర్లు ఉన్నాయా లేవాని చుచుకోవలని తెలిపారు.8 న సాయంత్రం పోలింగ్ అయిన తర్వాత ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బ్యాలెట్ బాక్స్ లు, పిఓ డైరీని అన్ని సక్రమంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి, నిమ్మనపల్లె, మండలాల యం.పి
డి ఓలు లీలామాదవి,లక్ష్మిపతి, రామసముద్రం మండలం ఎంపీడీఓ కార్యాలయం ఏ ఓ. పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement