Friday, April 26, 2024

పేదల కుటుంబానికి పెద్ద కుమారుడు జగన్ : ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : పేదల కుటుంబానికి పెద్ద కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బుధవారం 47వ డివిజన్ కార్పొరేటర్ కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ లబ్ధిపై ఆరా తీశారు. సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ లబ్ధిదారులకు సంక్షేమ పథకాల బుక్ లెట్ ను పంపిణీ చేశారు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కాలనీలోని ప్రజలు రోడ్లు, కాలువలను, నిర్మించాలని సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఏ సమస్యలు వచ్చినా అర్హత ఉండి ఏ సంక్షేమ పథకాలు అందకపోయినా తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ. వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి గోపాల్ రెడ్డి. వైఎస్ఆర్సిపి నాయకులు సురేందర్ రెడ్డి, నారపరెడ్డి రాజారెడ్డి, రమణ, పాములరమేష్ రెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement