Thursday, April 25, 2024

చిత్తూరు జిల్లాలో.. సకాలంలో వైద్యం అందక తల్లీ బిడ్డ మృతి

సకాలంలో వైద్యం అందక తల్లీ బిడ్డ మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రామకుప్పం మండలం యానాది కాలనీలో అర్ధరాత్రి ఓ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 ఆలస్యం కావడంతో ఆ మహిళ ఇంట్లోనే కవలలకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను రామకుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామకుప్పం వైద్యులు కుప్పం ఈపీఎస్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. పీఈఎస్ లో చికిత్స పొందుతూ తల్లీ బిడ్డ మరణించారు. మరో బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతోంది. 108 ఆలస్యం వల్లే తల్లీ బిడ్డ మృతిచెందారని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement