Tuesday, April 23, 2024

సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ : సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరిస్తామని శనివారం బేరి వీధి కణాల వీధి.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని గడపగడపకు కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు ప్రజలు చెప్తుంటే విని సంతోషంగా ఉందన్నారు. గత 14 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చేయలేని అభివృద్ధిని మూడు సంవత్సరాల్లో చేసి చూపించిన జగనన్న జన నీరాజనాలు అందుకుంటున్నారని. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు నరసింహ, రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదం రాధాకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement