Thursday, April 25, 2024

భార్య ఒడిలోనే భర్త మృతి

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారంపై భార్య ఓడిలోనే భర్త ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం మిద్దూరుకు చెందిన చంద్రశేఖర్ (60), అతని భార్య బెంగళూరుకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరూ కరోనా బారినపడడంతో 15 రోజుల క్రితం కుప్పం ఆస్పత్రిలో చేరారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక బెంగళూరు వెళ్లేందుకు దంపతులిద్దరూ కుప్పం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అనూహ్యంగా అస్వస్థతకు గురైన చంద్రశేఖర్ ప్లాట్‌ఫారంపై భార్య ఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. భర్తను కోల్పోవడంతో అక్కడే గుండెలు పగిలేలా విలపిస్తున్న మహిళను చూసినవారు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement