Friday, March 29, 2024

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుని వాటిని తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వ పథకాలను వివరించేందుకు నేరుగా గడపగడపకూ వస్తున్నామని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 48వ డివిజన్ కార్పొరేటర్ అన్నా సంధ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఇంటికి చిరునవ్వుతో పలకరిస్తూ గత మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి గురించి బుక్ లెట్ ను అందజేశారు. రోడ్డు సమస్య, వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రివైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నవరత్నాల పథకాలు అమలు చేస్తూ పేదల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలు వల్ల ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ హామీలు చేస్తూ సీఎం జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారు అని కొనియాడారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని పరిష్కరించేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే వస్తున్నామన్నారు. సమస్యలు ఉంటే తెలుసుకుని పరిష్కరించేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే వస్తున్నామన్నారు. సమస్యలు లేని ఇల్లు చూడాలన్నదే జగనన్న ఆశయం అన్నారు. వాలంటీర్లు సచివాలయం సిబ్బంది నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు ఊరి గుడిసెల్లో నివసించే వారికి ప్రభుత్వం ఇల్లు నిర్మిస్తుందని. ప్రతి ఒక్కరూ కట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు.. వైఎస్ఆర్సిపి నాయకులు రెడ్డప్ప. పాముల రమేష్ రెడ్డి. వెంకటరమణ . డి ఈ. విజయ్ కుమార్ రెడ్డి.పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement