Saturday, April 20, 2024

పెరిక కులస్థులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – గంగాభవాని

తిరుపతి, జిల్లాలోని పెరిక బలిజ కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెరిక కార్పొరేషన్ చైర్పర్సన్ గంగాభవాని పురుషోత్తం అన్నారు. సోమవారం తిరుపతి పర్యటనకు విచ్చేసిన చైర్మన్ గంగాభవానిని జిల్లా పెరిక బలిజ సంఘం నాయకులు ఆకా గుర్రప్ప. కే చంద్రశేఖర్. గోకుల రామకృష్ణ. సింగంశెట్టి సుబ్బరామయ్య. టి జనార్ధన్ లు. దుశ్శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. జిల్లాలో పెరిక కులస్తులకు పెరిక కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పట్టిస్తున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సమస్యను.. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. పెరిక కులస్తుల ఆర్థికాభివృద్ధికి మెడికల్ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చంద్రశేఖర రావు, సురేష్. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement