Tuesday, April 23, 2024

కల్వర్టును కారు ఢీకొన్న ప్రమాదం…నలుగురి దుర్మరణం.. అతివేగ‌మే కార‌ణం

మదనపల్లె : అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపం గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం నిమ్మనపల్లి మండలం రెడ్డి వారిపల్లెకు గంగరెడ్డి కుటుంబంతో కారులో ఒక పెళ్ళికి వెళ్లి  వస్తున్నారు. పుంగనూరు రోడ్డులోని 150వ మైలు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొని పక్కకు పడిపోయింది. ఆ ప్రమాదంలో గంగిరెడ్డితో పాటు భార్య మధులత, పిల్లలు కుషిత, దేవాన్ష్ అక్క డికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారు పూర్తిగా నలిగిపోవడంతో లోపల చిక్కుకుపోయిన నలుగురి మృతదేహాలను బయటకు తీయడం కష్టతరంగా మారింది. అతివేగమే ప్రమాదకారణమని భావిస్తున్నట్టు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement