Wednesday, April 24, 2024

ఫుడ్ పాయిజన్.. 30మంది విద్యార్థులకు అస్వస్థత

ఫుడ్ పాయిజన్ అయి 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వీరబల్లి కస్తూర్భా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వీరబల్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో రాయచోటి ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement